PM Modi: ప్రధాని మోదీకి బ్రెజిల్లో బ్రహ్మరథం.. శివ తాండవ స్తోత్రంతో మార్మోగిన పరిసరాలు
- రాజధాని బ్రసీలియాలో అపూర్వ సాంస్కృతిక ప్రదర్శనతో స్వాగతం
- శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ఫ్యూజన్ ప్రదర్శన
- తమ జీవితాలను మార్చిన వేదాంత జ్ఞానమంటూ బ్రెజిలియన్ల ప్రశంసలు
- బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్న ప్రధాని
బ్రెజిల్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజధాని బ్రసీలియాలో అపూర్వ స్వాగతం లభించింది. భారతీయ సంస్కృతి, బ్రెజిల్ సంప్రదాయాల మేళవింపుతో సాగిన ఓ ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్కు చెందిన సాంబా రెగె సంగీతం, అమెజాన్ గీతాలు ఒకే వేదికపై ప్రదర్శితమవడం ఈ కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ అద్భుతమైన ఘట్టం తమకు దక్కిన ఆశీర్వాదమని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రెజిల్లో ప్రముఖ వేదాంత గురువు జోనాస్ మసెట్టి అభివర్ణించారు. "భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇదొక గొప్ప అవకాశం. వేదాంత జ్ఞానం మా జీవితాలను, మా సమాజాన్ని సమూలంగా మారుస్తోంది" అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని శక్తి, కరుణ తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఓ యోగా టీచర్ కెన్లిన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం భారతీయ సమాజానికి ఒక అందమైన కానుక అని ఐసీసీఆర్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ శుక్లా అన్నారు. "వేద మంత్రాలకు, అమెజాన్ గీతాలకు మధ్య ఉన్న సారూప్యతలపై మా వివేకానంద కేంద్రంలో పరిశోధన చేస్తున్నాం" అని ఆమె వివరించారు. దాదాపు 10 ఏళ్లుగా వేదాంతం అభ్యసిస్తున్నానని, తమ గురువు సమక్షంలో ప్రధాని ముందు మంత్రాలు పఠించడం గౌరవంగా భావిస్తున్నానని ఓ కళాకారుడు పేర్కొన్నారు.
ఈ అపురూప స్వాగతంపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "భారత ప్రవాసులు తమ మూలాలతో ఎంత బలంగా అనుబంధం కలిగి ఉన్నారో ఈ చిరస్మరణీయ స్వాగతం మరోసారి నిరూపించింది" అని ఆయన పోస్ట్ చేశారు. 17వ బ్రిక్స్ సదస్సును ముగించుకుని రియో డి జెనీరో నుంచి బ్రసీలియా చేరుకున్న మోదీకి బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ ముసియో మాంటెరో ఫిల్హో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఈ అద్భుతమైన ఘట్టం తమకు దక్కిన ఆశీర్వాదమని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్రెజిల్లో ప్రముఖ వేదాంత గురువు జోనాస్ మసెట్టి అభివర్ణించారు. "భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఇదొక గొప్ప అవకాశం. వేదాంత జ్ఞానం మా జీవితాలను, మా సమాజాన్ని సమూలంగా మారుస్తోంది" అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని శక్తి, కరుణ తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఓ యోగా టీచర్ కెన్లిన్ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ ప్రత్యేక కార్యక్రమం భారతీయ సమాజానికి ఒక అందమైన కానుక అని ఐసీసీఆర్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ శుక్లా అన్నారు. "వేద మంత్రాలకు, అమెజాన్ గీతాలకు మధ్య ఉన్న సారూప్యతలపై మా వివేకానంద కేంద్రంలో పరిశోధన చేస్తున్నాం" అని ఆమె వివరించారు. దాదాపు 10 ఏళ్లుగా వేదాంతం అభ్యసిస్తున్నానని, తమ గురువు సమక్షంలో ప్రధాని ముందు మంత్రాలు పఠించడం గౌరవంగా భావిస్తున్నానని ఓ కళాకారుడు పేర్కొన్నారు.
ఈ అపురూప స్వాగతంపై ప్రధాని మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "భారత ప్రవాసులు తమ మూలాలతో ఎంత బలంగా అనుబంధం కలిగి ఉన్నారో ఈ చిరస్మరణీయ స్వాగతం మరోసారి నిరూపించింది" అని ఆయన పోస్ట్ చేశారు. 17వ బ్రిక్స్ సదస్సును ముగించుకుని రియో డి జెనీరో నుంచి బ్రసీలియా చేరుకున్న మోదీకి బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ ముసియో మాంటెరో ఫిల్హో విమానాశ్రయంలో స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో సమావేశమై ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.