Kerala: కేరళలో అటవీశాఖ అధికారిణి సాహసం.. కింగ్ కోబ్రాను ఎలా పట్టారో చూడండి (వీడియో)
- కేరళలో మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ సాహసం
- నివాస ప్రాంతంలోకి వచ్చిన 18 అడుగుల కింగ్ కోబ్రా
- కర్ర సాయంతో చాకచక్యంగా పట్టుకున్న రోషిణి
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటైన కింగ్ కోబ్రాను ఒక అటవీశాఖ అధికారిణి ఎంతో సునాయాసంగా పట్టుకున్నారు. కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తిరువనంతపురంలోని పెప్పర ప్రాంతంలో ఉన్న ఒక కాలనీలోని కాలువలో భారీ కింగ్ కోబ్రాను స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరుథిపల్లి రేంజ్కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
దాదాపు 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను చూసి ఆమె ఏమాత్రం బెదరలేదు. ఒక కర్ర సహాయంతో ఎంతో నైపుణ్యంగా కోబ్రాను నియంత్రించి సంచిలో బంధించారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. రోషిణి ఇలా పాములను పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఆమె 500కు పైగా పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారని సమాచారం.
తిరువనంతపురంలోని పెప్పర ప్రాంతంలో ఉన్న ఒక కాలనీలోని కాలువలో భారీ కింగ్ కోబ్రాను స్థానికులు గుర్తించారు. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పరుథిపల్లి రేంజ్కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి సంఘటన స్థలానికి చేరుకున్నారు.
దాదాపు 18 అడుగుల పొడవున్న ఆ కింగ్ కోబ్రాను చూసి ఆమె ఏమాత్రం బెదరలేదు. ఒక కర్ర సహాయంతో ఎంతో నైపుణ్యంగా కోబ్రాను నియంత్రించి సంచిలో బంధించారు. ఈ దృశ్యాలను అక్కడున్న వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. రోషిణి ఇలా పాములను పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదని, గతంలో ఆమె 500కు పైగా పాములను సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారని సమాచారం.