కదులుతున్న రైల్లో దోపిడీ.. పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం
- ముగ్గురు మహిళల నుంచి బంగారం, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
- కావలి సమీపంలో మూడు బోగీల్లోని ప్రయాణికులకు చుక్కలు
- సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఘటన
- రైల్వే పోలీసులకు బాధితుల ఫిర్యాదు, దర్యాప్తు ముమ్మరం
నిద్రపోతున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలోంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలు లాక్కెళ్లారు. వారి వద్ద ఉన్న రూ.20,000 నగదు, ఒక సెల్ఫోన్ను కూడా అపహరించారు. తెల్లవారుజామున జరిగిన ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
దోపిడీ అనంతరం దొంగలు రైలు నుంచి దూకి పరారైనట్లు తెలుస్తోంది. బాధితులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ముమ్మరం చేశారు.