ఆ విమాన పైలెట్లకు 9 వేల గంటల అనుభవం.. అయినప్పటికీ...!
- అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఔ
- టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రన్వే 23 వద్ద ప్రమాదం, విద్యార్థుల హాస్టల్పై పడ్డ వైనం
- విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది.. వీరిలో 169 మంది భారతీయులు
- పైలట్లు కెప్టెన్ సుమీత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్లకు వేల గంటల అనుభవం
ఈ విమానాన్ని నడిపిన పైలట్లు అత్యంత అనుభవజ్ఞులని తెలిసింది. కెప్టెన్ సుమీత్ సబర్వాల్కు సుమారు 8,200 గంటల విమాన ప్రయాణ అనుభవం ఉండగా, ఆయన సహచరుడు ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్కు 1,100 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. ఇంతటి అనుభవజ్ఞులు నడిపిన విమానం ప్రమాదానికి గురికావడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు ఈ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేకంగా 1800 5691 444 నంబరుతో ఒక హాట్లైన్ను ఏర్పాటు చేసింది. అలాగే, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా AI-171 ప్రమాదానికి సంబంధించిన వివరాలను సమన్వయం చేయడానికి ఒక ఆపరేషనల్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. ప్రజలు సమాచారం కోసం 011-24610843 లేదా 9650391859 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.