Andhra Pradesh Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం... ఈరోజు మరో పాజిటివ్ కేసు నమోదు
- కడప జిల్లాలో కొత్త కరోనా కేసు
- 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్
- ప్రజలను అప్రమత్తం చేసిన వైద్య, ఆరోగ్య శాఖ
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై, ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వస్తున్న నివేదికల నేపథ్యంలో, ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లేదా దిబ్బడ వేయడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ పనిచేసే ల్యాబ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన టెస్టింగ్ కిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగినంత నిల్వ ఉంచుకోవాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.
నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వస్తున్న నివేదికల నేపథ్యంలో, ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంతవరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లేదా దిబ్బడ వేయడం, వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24 గంటలూ పనిచేసే ల్యాబ్లను సిద్ధంగా ఉంచాలని, అవసరమైన టెస్టింగ్ కిట్లు, మాస్కులు, పీపీఈ కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులను తగినంత నిల్వ ఉంచుకోవాలని వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది.