విజయసాయిరెడ్డి... చంద్రబాబుకు లొంగిపోయారు: జగన్ తీవ్ర ఆరోపణలు
- కూటమికి మేలు చేసేందుకే విజయసాయి రాజ్యసభకు రాజీనామా చేశారన్న జగన్
- మూడున్నరేళ్ల పదవీకాలాన్ని ప్రలోభాలకు లోనై వదులుకున్నారని విమర్శలు
- వైసీపీకి బలం లేదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్య
- అలాంటి వ్యక్తి చేసే ప్రకటనలకు విలువ ఉండదని స్పష్టీకరణ
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేసే ప్రకటనలకు ఏం విలువ ఉంటుంది? ఆయన చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి" అని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డికి ఇంకా మూడున్నర సంవత్సరాల పదవీకాలం మిగిలి ఉందని, అయినప్పటికీ కేవలం చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ప్రయోజనం చేకూర్చేందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున, విజయసాయిరెడ్డిని మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసని జగన్ అన్నారు. "తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి, తన మూడున్నరేళ్ల పదవీకాలాన్ని ఆ కూటమికి, ప్రలోభాలకు లోనై అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం విలువ ఉంటుంది?" అని జగన్ ప్రశ్నించారు.