ప్రపంచ ఆర్థిక సంక్షోభంపై హెచ్చరిక చేసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత
- పెరుగుతున్న సమస్యకు మూలం 1971 నాటిదన్న రాబర్ట్ కియోసాకి
- బంగారం, వెండి, బిడ్ కాయిన్ లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడొచ్చన్న కియోసాకి
- సోషల్ మీడియాలో కియోసాకి ట్వీట్ వైరల్
సాంప్రదాయ పొదుపు ఇకపై సురక్షితం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. తాను 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పినట్లుగా ధనికులు డబ్బు కోసం పని చేయరని, పొదుపు చేసేవారు నష్టపోతారని పేర్కొన్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్లను ఆదా చేయడం ద్వారా సంక్షోభం నుంచి బయటపడవచ్చని ఆయన అన్నారు. 2012లో రిచ్ డాడ్ ప్రవచనంలో తాను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైందని, దయచేసి జాగ్రత్తగా ఉండాలని కియోసాకి సూచించారు. ప్రస్తుతం కియోసాకి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.