అమెరికాలో టోర్నడోల విలయం... 21 మంది మృతి
- కెంటరీ, మిస్సోరీ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడోలు
- మిస్సోరీలో ధ్వంసమైన ఐదు వేల భవనాలు
- దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కెంటకీలోని లారెల్ కౌంటీలో టోర్నడో కారణంగా తొమ్మిది మంది మరణించారని అధికారులు వెల్లడించారు. అనేక మంది గాయపడ్డారని, ఆస్తినష్టం కూడా భారీగా సంభవించిందని తెలిపారు. మిస్సోరీలో ఐదు వేల భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడి సెయింట్ లూయిలో ఐదుగురు మృతి చెందగా, దాదాపు లక్ష నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇల్లినోయీలో కూడా టోర్నడోలు బీభత్సం సృష్టించినట్లు యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.