ఉగ్రవాదంపై పోరాడండి.. మీ వెనక మేం ఉంటాం: భారత్ కు అమెరికా హామీ
- వీలైనంత సాయం అందిస్తామని ప్రకటించిన అమెరికా స్పీకర్
- భారత్ తమకు కీలక భాగస్వామి అని వెల్లడి
- పహల్గామ్ దాడి తర్వాత అమెరికా నేతల సంఘీభావం
పహల్గామ్లో ఉగ్రదాడి జరిగినప్పుడు (ఏప్రిల్ 22) కూడా అమెరికా నేతలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్లతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం అందిస్తామని, దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు పూర్తి మద్దతు ఇస్తామని వారు హామీ ఇచ్చారు. ఉద్రిక్తతలు తగ్గించుకొని, శాంతిని కాపాడేందుకు పాకిస్థాన్తో కలిసి పనిచేయాలని కూడా రూబియో సూచించినట్లు అప్పటి స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి తెలిపారు.