పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్
- సొంత నియోజకవర్గంపై పవన్ కల్యాణ్ దృష్టి
- 30 పడకల ఆసుపత్రిని మరింత అప్ గ్రేడ్
- మోదీ, చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురంను మరింత అభివృద్ధి చేస్తామన్న పవన్
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడం ఈ అభివృద్ధి ప్రస్థానంలో ఒక భాగమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన ఉద్ఘాటించారు. "అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పని చేస్తున్నాం" అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
పిఠాపురంలో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆసుపత్రి స్థాయిని పెంచుతున్నామని, దీనివల్ల స్థానిక ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.