వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ పై విచారణ వాయిదా
- కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్
- 10 రోజుల కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు
- నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపిన పోలీసులు
కాగా, వంశీని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. వంశీ, మరో ఇద్దరిని 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని తెలిపారు.
కోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.