హోంలోన్స్ తీసుకున్న ఖాతాదారులకు ఎస్ బీఐ శుభవార్త
- నెలనెలా చెల్లించే ఈఎంఐ తగ్గించనున్నట్లు ప్రకటన
- ఫిబ్రవరి 15 నుంచే అమలు
- ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో ప్రయోజనం
అయితే, ఎంసీఎల్ఆర్, బీపీఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. కాగా, హోమ్ లోన్స్ కు రెపో రేటును అనుసంధానించేందుకు 2019 అక్టోబర్ 1 నుంచి ఎస్ బీఐ ఈబీఎల్ఆర్ విధానాన్ని అనుసరిస్తోంది. దీంతో ఆర్ బీఐ రెపో రేటు మారినప్పుడు ఈ రేటు మారుతుంది. దీని ప్రభావం ఖాతాదారుల రుణాలపై పడుతోంది. రెపో రేటు తగ్గినప్పుడు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ తగ్గుతుంది. ఈబీఎల్ఆర్ తో లింక్ అయిన హోమ్ లోన్స్ తో పాటు పర్సనల్ లోన్స్, ఇతర లోన్లపైనా వడ్డీ రేటు తగ్గుతాయి.