ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన తెలంగాణ ప్రభుత్వం
- సమ్మెకు దిగుతామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు
- 21 డిమాండ్లతో నోటీసులు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ
- ఈ క్రమంలో 10వ తేదీ సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానం
ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించినట్లు కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, రెండు పీఆర్సీలను అమలు చేయాలని, 2021 వేతన సవరణను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలని, ఇలా మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది.