Chittoor District: ఏపీలో టిప్పర్ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు .. నలుగురి మృతి
- చిత్తూరు జిల్లా శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం
- గాయపడిన 13 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు శివారు గంగాసాగరం వద్ద జరిగింది.
తిరుపతి నుంచి మధురై వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. అనంతరం 20 అడుగులు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంటు స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో కరెంటు స్తంభం బస్సులోకి చొచ్చుకుని రావడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు, నరివి ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
తిరుపతి నుంచి మధురై వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. అనంతరం 20 అడుగులు జారుకుంటూ వెళ్లి రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలోని కరెంటు స్తంభాన్ని బస్సు ఢీకొట్టింది. దీంతో కరెంటు స్తంభం బస్సులోకి చొచ్చుకుని రావడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వేలూరు, నరివి ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.