పుష్ప-2 ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
- అనంతపురం జిల్లాలో ఘటన
- రాయదుర్గంలోని ఓ థియేటర్ లో పుష్ప-2 ప్రదర్శన
- సినిమా ముగిసినా సీట్లోనే చలనం లేకుండా ఉన్న యువకుడు
- తొక్కిసలాట వల్లే చనిపోయాడంటున్న కుటుంబ సభ్యులు
ముద్దానప్ప కుటుంబ సభ్యులు థియేటర్ వద్దకు చేరుకుని, మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తొక్కిసలాట వల్లే ముద్దానప్ప మరణించాడంటూ, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.