వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం ప్రకటన
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
- వరుసగా 11వ సారి యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం
- ముగిసిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
- యథాతథంగా కొనసాగనున్న ఈఎంఐలు
కాగా రెపో రేటులో ఎలాంటి మార్పు లేకపోవడంతో బ్యాంక్ రుణాలపై వడ్డీ రేట్లు కూడా యథాతథంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈఎంఐలలో కూడా ఎలాంటి మార్పులు ఉండవు.
మందగించిన వృద్ధి
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు రెండేళ్ల కనిష్ఠ స్థాయి 5.4 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ వెల్లడించింది. తయారీ, మైనింగ్ రంగాల వృద్ధి పేలవంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జీడీపీ 8.1 శాతంగా నమోదైందని పేర్కొంది.