Telangana: తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పులు

Key changes in Telangana SSC marks system
షార్ట్స్‌లో చూడండి
పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం పదో తరగతికి 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.

ఇక నుంచి 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
Go Back to Shorts
Telangana
SSC
Congress

More Telugu News