అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్.. 20 వేల మందికి ఉపాధి
- ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్-నిప్పన్ స్టీల్స్
- రెండు దశల్లో పెట్టుబడులు
- తొలి దశలో ఏకంగా రూ. 70 వేల కోట్ల పెట్టుబడి
- ఫ్యాక్టరీ నిర్మాణంలో 25 వేల మందికి, నిర్వహణ కోసం 20 వేల మందికి ఉపాధి
- జనవరి 2029 నాటికి తొలి దశ నిర్మాణం పూర్తి
జనవరి 2029 నాటికి తొలి దశ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తారు. ఈ దశలో ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తారు. ప్లాంట్ నిర్మాణంలో 25 వేల మందికి, నిర్వహణ కోసం 20 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.