రేణూ దేశాయ్ ఆనందం... ఎందుకో తెలుసా...?
- మూగ జీవాల కోసం ఎన్జీవోను స్థాపించానన్న రేణూ దేశాయ్
- 8ఏళ్ల వయసు నుంచి మూగ జీవాలను సంరక్షిస్తున్నానని వెల్లడి
- మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు తమ ఎన్జీవోకు విరాళాలు ఇవ్వాలని రేణూ దేశాయ్ వినతి
ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నానో తనకు మాత్రమే తెలుసునని అన్నారు. తాను ఎనిమిదేళ్ల వయసు నుంచి మూగ జీవాలపై మక్కువతో వాటిని సంరక్షిస్తూ వస్తున్నాను కానీ ఈ విషయం గురించి బయటకు చెప్పాలని, ప్రచారం చేసుకోవాలని ఎప్పుడూ భావించలేదన్నారు. మూగ జీవాలకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలని వాటి కోసం పెద్దగా మాట్లాడాలని కానీ ఆలోచించలేదన్నారు. అయితే కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఏదైనా చేయాలని తనకు అనిపించిందన్నారు.
ఆ క్రమంలో వాటి కోసం సొంతంగా ఎన్జీవో స్థాపించాలని తను అనుకున్నానని, ఫైనల్గా ఆ కోరిక నేడు నెరవేరిందని చెప్పారు. అందుకు తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను ఎన్జీవోను రిజిస్టర్ చేయించానని, మూగ జీవాలపై ఇష్టం ఉండి ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు తమ ఎన్జీవోకు విరాళాలు ఇవ్వాలని రేణూ దేశాయ్ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూగ జీవాల కోసం ఆమె తీసుకున్న నిర్ణయానికి అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.