అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు కర్నూలు జిల్లా వాసుల మృతి
- రైల్వే కోడూరు మండలం రాజానగర్ వద్ద ఘటన
- ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఏసీ బస్సు, ఇన్నోవా కారు ఢీ
- తిరుపతిలో రిసెప్షన్ వేడుకకు వెళుతుండగా ఘటన
ఈ ఘటనలో కర్నూలు జిల్లా ఎల్లురు నగర్కు చెందిన రావూరి ప్రేమ్ కుమార్ (51), రావూరి వాసవి (47), నరసింహారెడ్డి నగర్కు చెందిన కామిశెట్టి సుజాత (40) మృతి చెందారు. వీరంతా తిరుపతిలో రిసెప్షన్ వేడుకకు వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని 108 అంబులెన్స్లో రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.