ప్రముఖ గాయని సుశీలకు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం
- ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ‘కళైగ్నర్ మెమోరియల్ కళైతురై విఠగర్’ అవార్డు అందుకున్న సుశీల
- ఈ సందర్భంగా స్టాలిన్కు ఇష్టమైన పాటలోని కొన్ని చరణాల ఆలాపన
- సుశీలకు అవార్డు అందించినందుకు గర్వంగా ఉందన్న సీఎం
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ గతేడాది డాక్టర్ జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సుశీలను గౌరవించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం స్టాలిన్ ఎక్స్లో పోస్టు చేస్తూ.. సౌత్ ఇండియన్ నైటింగేల్ సుశీలకు అవార్డు అందించినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె తన గాత్రంతో లక్షలమంది అభిమానుల హృదయాలను పరవశింపజేశారని కొనియాడారు. అలాగే, కవి ము మేథా కవితను గుర్తు చేసుకున్నారు.