రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన
- రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత కదలిక దృశ్యాలు
- భయాందోళనలకు గురవుతున్న స్థానికులు
- చిరుతను ట్రాప్ బోనులో బంధించేందుకు ముమ్మరంగా యత్నిస్తున్న అటవీ శాఖ అధికారులు
చిరుతను కచ్చితంగా పట్టుకుంటామని ఫారెస్టు అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే రాజమండ్రి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటోనగర్ అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ఏరియాలలో పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదని అంటున్నారు. చిరుత కదలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.