జగన్తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్కు మెమో!
- టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెెస్ట్
- గుంటూరు జైలులో ఆయనను పరామర్శించిన జగన్
- జైలు బయట జగన్తో మహిళా కానిస్టేబుల్ సెల్ఫీ
- ఫొటో వైరల్ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు
అనంతరం బయటకు వచ్చిన జగన్తో అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ దిగారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.