మీ కుటుంబ సభ్యుడిగా ఇదే నా మనవి.. తెలుగు ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచన

Mega Star Chiranjeevi Warns Telugu State People About Heavy Rains
  • భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఎవరూ బయటకు రావొద్దని సూచన
  • పలు చోట్ల రోడ్లు మునిగిపోయాయని అప్రమత్తంగా ఉండాలన్న చిరంజీవి
  • విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దన్న స్టార్ నటుడు
  • విపత్తుల సమయంలో తన అభిమానుల అండ ఉంటుందన్న మెగాస్టార్
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.  ఏపీ, తెలంగాణలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని, పలు గ్రామాలు, జాతీయ రహదారులు మునిగిపోయాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని మీ కుటుంబ సభ్యుడిగా మనవి చేసుకుంటున్నానని చిరంజీవి సూచించారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దని, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు తన అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని, ఇప్పుడు కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నట్టు చిరంజీవి పేర్కొన్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Heavy Rains
Andhra Pradesh
Telangana

More Telugu News