ఏపీకి 'గ్రీన్ ఎనర్జీ చాంపియన్' అవార్డు
ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ, సీఈవో ఎం. కమలాకర్ బాబు కేంద్ర నూతన, పునరత్పాదక ఇంధన శాఖ సంయుక్త కార్యదర్శి లలిత్ బోరా నుంచి అవార్డు స్వీకరించారు. ఈ అవార్డు కోసం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు పోటీ పడినా, ఏపీ వాటిని అధిగమించింది.
కాగా, అవార్డు అందుకున్న సందర్భంగా కమలాకర్ బాబు మాట్లాడుతూ... ఈ అవార్డు ఏపీకి దక్కిందంటే ఆ ఘనత సీఎం చంద్రబాబుదేనని తెలిపారు. గతంలో 2014-19 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన రంగంలో చేసిన కృషి ఇప్పుడు అవార్డు రావడానికి కారణమైందని వివరించారు.