మెరిసిపోతున్న కొండారెడ్డి బురుజు.. పంద్రాగస్టు వేళ ప్రత్యేక అలంకరణ
- స్వాతంత్ర్య వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
- కర్నూలులో కొండారెడ్డి బురుజుకు విద్యుత్ దీపాలతో అలంకరణ
- మువ్వన్నెల రంగులతో మెరిసిపోతున్న బురుజు
మరో పక్క స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏపీ సర్కార్ గ్రామ పంచాయతీలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ పంచాయతీల్లోనూ ఘనంగా తిరంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఈ వేడుకలకు అతితక్కువ మాత్రమే కేటాయింపులు ఉండగా, తాజాగా డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ గ్రామ పంచాయతీల్లో ఈ వేడుకల నిర్వహణకు రూ.10వేల నుంచి రూ.25వేల వరకూ కేటాయింపు చేశారు.