శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari offers prayers at Srisailam temple
 
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు శ్రీశైలం విచ్చేశారు. భువనేశ్వరి శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు, శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు, ఆలయ అర్చకస్వాములు నారా భువనేశ్వరికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
Srisailam
Temple
TDP
Andhra Pradesh

More Telugu News