లంకతో రెండో టీ20... టాస్ గెలిచిన టీమిండియా
- టీమిండియా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
- నేడు రెండో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ఓపెనర్ శుభ్ మాన్ గిల్ మెడనొప్పితో బాధపడుతుండడంతో, అతడిని ఈ మ్యాచ్ కు ఎంపిక చేయలేదు. గిల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్ కు తుదిజట్టులో చోటు కల్పించారు. అటు, లంక జట్టులోనూ ఒక మార్పు జరిగింది. దిల్షాన్ మధుశంక స్థానంలో రమేశ్ మెండిస్ జట్టులోకి వచ్చాడు.