ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం: మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం: మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

Nara Lokesh about ongoing controversy on Thalliki Vandanam scheme
  • తల్లికి వందనం పథకానికి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు వెల్లడి
  • ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే వారందరికీ వర్తిస్తుందని స్పష్టీకరణ
  • ఈ పథకంలో లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని వెల్లడి
ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పైగా ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందన్నారు.

ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలోనే చెప్పామని, ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నామన్నారు. నిబంధనలు రూపొందించేందుకు కాస్త సమయం కావాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా రూపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఈ అంశంపై మంత్రులతో చర్చిస్తున్నట్లు చెప్పారు.

గతంలో ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి... ఆ తర్వాత రూ.14 వేలు, అనంతరం రూ.13 వేలకు తగ్గిందన్నారు. అర్హత నిబంధనలు కూడా గత ప్రభుత్వం మార్చిందన్నారు. ఇలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామన్నారు. తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తామన్నారు.
Advertisement
Nara Lokesh
Thallikivandnam
Andhra Pradesh

More Telugu News