క్వారీ గుంతలో పడి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సహా ముగ్గురి మృతి
- సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బొప్పారంలో విషాదం
- ఉదయం క్వారీని చూసేందుకు వెళ్లిన శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు
- క్వారీలో పడిపోయిన కూతురు
- ఆమెను కాపాడే క్రమంలో అందరూ మృతి
బుధవారం ఉదయం శ్రీపాల్ రెడ్డి, రాజు, ఆయన కూతురు క్వారీని చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాజు కూతురు క్వారీలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు శ్రీపాల్ రెడ్డి, రాజు అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.