బిడ్డలకు తాను తండ్రిని కాదన్న భర్త.. నవజాత కవలలను గొంతుకోసి చంపిన తల్లి
- జమ్మూకశ్మీర్లో ఘటన
- భర్త సౌదీ నుంచి వచ్చిన మూడు నెలలకే మహిళ ప్రసవం
- వారు తన సంతానం కాదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు
- సమస్య తప్పదన్న భయంతో కన్నబిడ్డలను కడతేర్చిన మహిళ
దీంతో, ఆ బిడ్డలు తన సంతానం కాదంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో, తనకు సమస్యలు తప్పవని భావించిన మహిళ నవజాత శిశువులను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేసింది.
ఈ దారుణానికి మహిళ భర్త కారణమని స్థానికులు ముందుగా భావించినా, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను పోలీసులను ప్రశ్నించగా, ఆమె చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది. దీంతో, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.