రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్
- ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించాడని కేసు
ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయనపై జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.