తెలంగాణ బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత

BJP leader Ramesh Rathode passes away
బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూశారు. గత అర్ధరాత్రి ఉట్నూరులోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రమేశ్ రాథోడ్ మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.
Go Back to Shorts
Ramesh Rathod
BJP
Telangana
Adilabad District

More Telugu News