షాద్నగర్ గ్లాస్ కంపెనీలో ఘోర ప్రమాదం... ఆరుగురి మృతి
- సౌత్ గ్లాస్ ప్రైవేట్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ప్రమాదం
- గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు
- ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. మృతి చెందినవారిలో ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్ వాసులు ఉన్నారు.