ఎంఎస్ ధోనీ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్
- 549 పరుగులతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా నిలిచిన బాబర్
- రెండవ స్థానానికి పడిపోయిన ఎంఎస్ ధోనీ
- ఐర్లాండ్పై ఓదార్పు విజయం సాధించిన పాకిస్థాన్
టీ20 ప్రపంచ కప్లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా ఎంఎస్ ధోనీ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఐర్లాండ్పై 32 పరుగులతో టీ20 వరల్డ్ కప్లలో బాబర్ 17 మ్యాచ్ల్లో మొత్తం పరుగులు 549కి పెరిగాయి. ఇక 29 మ్యాచ్లు ఆడి 529 పరుగులు చేసి ఇంతకాలం తొలి స్థానంలో ఉన్న ధోనీని అతడు అధిగమించాడు. న్యూజిలాండ్ దిగ్గజం కేన్ విలియమ్సన్ మొత్తం 19 మ్యాచ్లు ఆడి 527 పరుగులు సాధించి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్లలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు వీళ్లే..
1. బాబర్ ఆజం - 549 (17 మ్యాచ్లు)
2. ఎంఎస్ ధోనీ - 529 (29 మ్యాచ్లు)
3. కేన్ విలియమ్సన్ - 527 (19 మ్యాచ్లు)
4. మహేల జయవర్ధనే - 360 (11 మ్యాచ్లు)
5. గ్రేమ్ స్మిత్ - 352 (16 మ్యాచ్లు).