తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు జాతీయ అవార్డు
- కేరళ క్యాడర్ లో వన్నెలీనుతున్న కృష్ణతేజ
- ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వైనం
- బాలల హక్కుల పరిరక్షణలో దేశంలోనే నెంబర్ వన్ గా త్రిస్సూర్ జిల్లా
- బాలల హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసిన కృష్ణతేజ
కృష్ణతేజ ఎంతో సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందారు. కేరళలో వరదలు ప్రళయం సృష్టించిన సమయంలో ఆయన చూపించిన చొరవ జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. ఆ సమయంలో కృష్ణతేజ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్ గా ఉన్నారు.
ఆ తర్వాత కాలంలో ఆయనను కేరళ పర్యాటక శాఖ డైరెక్టర్ గా నియమించారు. అనంతరం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు అందుకున్నారు.