ఎండలతో అల్లాడుతున్న వేళ.. వాతావరణశాఖ చల్లటి కబురు
- గురువారమే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు
- ఈసారి నిర్ణీత సమయానికి ముందుగానే వర్షాలు
- ఇప్పటికే పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన రుతుపవనాలు
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి. రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడడంతో వాటి గమనాన్ని ఇది బలంగా లాగిందని, అందుకనే అనుకున్న సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని వాతావరణశాఖ పేర్కొంది.