ముస్లిం రిజర్వేషన్లపై మాట్లాడితే ప్రధాని మోదీపై పరువునష్టం దావా వేస్తా: షబ్బీర్ అలీ హెచ్చరిక
- ముస్లిం రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న షబ్బీర్ అలీ
- అలాంటప్పుడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎలా చెబుతారు? అని ప్రశ్న
- ముస్లిం రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇవ్వలేదు... పేదరికం ఆధారంగా ఇచ్చారన్న షబ్బీర్ అలీ
హిందూ, ముస్లిం అంటూ ప్రజల మధ్య మోదీ చిచ్చు పెడుతున్నారన్నారు. కోర్టులో ఉన్న అంశంపై ప్రధాని మోదీ మాట్లాడటం సరికాదన్నారు. అయినా మైనార్టీ రిజర్వేషన్లు మతప్రాతిపదికన ఇవ్వలేదన్నారు. పేదరికం ఆధారంగా ఇచ్చారని తెలిపారు. ఈ రిజర్వేషన్లు ఇచ్చి కూడా రెండు దశాబ్దాలు దాటిందన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై కోర్టుల ఆదేశాలు, జీవోలను ప్రధాని మోదీకి పంపిస్తున్నామన్నారు.