దేశాధ్యక్షుడు రైసీ మృతితో సంబరాలు చేసుకున్న ఇరానియన్లు
- హెలికాప్టర్ కూలిన ఘటనలో రైసీ దుర్మరణం
- రైసీ చాలా క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు
- ఇస్లామిక్ ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చిన రైసీ
ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలకు ఉరి వేయించాడని... ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని కూడా కఠినంగా శిక్షించాడని చెపుతున్నారు. ఇస్లామిక్ ఆచారాలకు రైసీ ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉంది. ఆయన మృతిని ప్రజలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారని స్థానిక మీడియా తెలిపింది.