జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్!
- అరవింద్ కృష్ణ హీరోగా రూపొందిన S.I.T
- ఓ యువతి మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
- కథానాయికగా అలరించనున్న నటాషా దోషి
- ఈ నెల 10 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
ఈ సినిమా ఇప్పుడు జీ 5లో ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఒక యువతి మర్డర్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. ఆ యువతి ఎవరు? ఆ హత్య చేసినదెవరు? ఆ కేసు విచారణలో పోలీస్ టీమ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ.
నాగిరెడ్డి - తేజ్ పల్లి - శ్రీనివాస రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. నటాషా దోషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలను రుచిత సాధినేని .. రజత్ రాఘవ .. అనుక్ రాథోడ్ .. కౌశిక్ కనిపించనున్నారు. వరికుప్పల యాదగిరి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా చెబుతున్నారు.