వెజ్ శాండ్విచ్ ఆర్డరిస్తే నాన్ వెజ్ డెలివరీ.. రూ.50 లక్షల పరిహారానికి మహిళ డిమాండ్
- ఆహ్మదాబాద్లో మహిళకు షాకింగ్ అనుభవం
- మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే రెస్టారెంట్పై రూ.5 వేల జరిమానా
- ఇది సరిపోదన్న మహిళ, రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధం
- తమ హక్కుల గురించి తెలియని వారి కోసం పోరాడుతున్నానని మహిళ వివరణ
అయితే, విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టని మహిళ రెస్టారెంట్ నుంచి రూ.50 లక్షల పరిహారం కోరుతూ కేసు వేసేందుకు సిద్ధమైంది. ‘‘ఇదో భయానక ఘటన. జరిగింది వెనక్కు తీసుకోలేము. రూ.5 వేల జరిమానా సరిపోదు. నేను వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తా. రూ.50 లక్షల కంటే ఎక్కువ పరిహారాన్ని నేను అడిగుండేదాన్నే. అప్పుడు కూడా నాకు తగిన న్యాయం జరిగి ఉండేది కాదు’’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై రెస్టారెంట్ యాజమాన్యం ఇంతవరకూ స్పందించలేదు.
మరోవైపు, మహిళ తీరును నెట్టింట కొందరు విమర్శించారు. అయితే, ఆమె మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. తమ హక్కులు ఏంటో తెలియని వినియోగదారుల కోసం తానీ పోరాటం చేస్తున్నట్టు నిరాలీ చెప్పుకొచ్చింది.