Nominations: ఏపీలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

Nominations withdrawal time line concluded in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మే 13న పోలింగ్ జరగనుండగా, నేటి మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,705 నామినేషన్లకు ఈసీ ఆమోదం లభించింది. 25 ఎంపీ స్థానాల కోసం 503 నామినేషన్లకు ఆమోదం లభించింది. 

ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం... తిరుపతి అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 48 నామినేషన్లు ఆమోదం పొందాయి. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి 6 నామినేషన్లు ఆమోదం పొందాయి. లోక్ సభ నియోజకవర్గాల విషయానికొస్తే... నంద్యాల ఎంపీ స్థానానికి అత్యధికంగా 36 నామినేషన్లు ఆమోదం పొందాయి. అత్యల్పంగా రాజమండ్రి ఎంపీ స్థానంలో 12 నామినేషన్లు ఆమోదం పొందాయి. 

నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన నేపథ్యంలో, ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అవకాశం ఉంది.
Go Back to Shorts
Nominations
Withdrawal
General Elections-2024
Andhra Pradesh

More Telugu News