పిల్లల స్కూలు ఫీజు డబ్బులతో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన ధోనీ వీరాభిమాని.. తలంటుతున్న నెటిజన్లు!

పిల్లల స్కూలు ఫీజు డబ్బులతో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన ధోనీ వీరాభిమాని.. తలంటుతున్న నెటిజన్లు!

Dhoni fan by ticket in black to watch Dhoni play in stadium
  • ధోనీ వీరాభిమాని ఘన కార్యం
  • స్టేడియంలోనే విషయాన్ని ఆనందంగా పంచుకున్న అభిమాని
  • ఇదేం పిచ్చిపనంటూ నెటిజన్ల మండిపాటు  
క్రికెట్ అంటే వెర్రెత్తిపోయేవాళ్లు ఉన్నారన్న మాట నిజమే కానీ, ఇది అంతకుమించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ ఆటను వీక్షించేందుకు ఓ వీరాభిమాని చేసిన పనికి అందరూ చీవాట్లు పెడుతున్నారు.  ఈ నెల 8న చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఏడు వికెట్లతో విజయం సాధించింది. 

ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలని ఉబలాటపడిన అభిమాని రూ. 64 వేలతో బ్లాక్‌లో టికెట్లు కొని మరీ వీక్షించి ఉబలాటం తీర్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. స్టేడియంలో అతడు స్పోర్ట్స్ వాక్ చెన్నై చానల్‌తో మాట్లాడుతూ తన పిల్లలకు స్కూలు ఫీజు కట్టేందుకు ఉంచిన రూ. 64 వేలతో బ్లాక్‌లో టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశానని సంబరపడిపోతూ చెప్పాడు. 

ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతూ చీవాట్లు పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా ఇదేం పిచ్చిపనంటూ మండిపడ్డారు.
Advertisement
MS Dhoni
IPL 2024
Dhoni Fan
School Fee
CSK
KKR

More Telugu News