పిల్లల స్కూలు ఫీజు డబ్బులతో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన ధోనీ వీరాభిమాని.. తలంటుతున్న నెటిజన్లు!
- ధోనీ వీరాభిమాని ఘన కార్యం
- స్టేడియంలోనే విషయాన్ని ఆనందంగా పంచుకున్న అభిమాని
- ఇదేం పిచ్చిపనంటూ నెటిజన్ల మండిపాటు
ధోనీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలని ఉబలాటపడిన అభిమాని రూ. 64 వేలతో బ్లాక్లో టికెట్లు కొని మరీ వీక్షించి ఉబలాటం తీర్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. స్టేడియంలో అతడు స్పోర్ట్స్ వాక్ చెన్నై చానల్తో మాట్లాడుతూ తన పిల్లలకు స్కూలు ఫీజు కట్టేందుకు ఉంచిన రూ. 64 వేలతో బ్లాక్లో టికెట్లు కొని మరీ మ్యాచ్ చూశానని సంబరపడిపోతూ చెప్పాడు.
ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు విరుచుకుపడుతూ చీవాట్లు పెట్టారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా ఇదేం పిచ్చిపనంటూ మండిపడ్డారు.