కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరు.. పదేళ్లు రేవంతే సీఎం: మంత్రి కోమటిరెడ్డి
- పార్టీలో గ్రూపులు లేవు.. అంతా రేవంత్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామన్న కాంగ్రెస్ సీనియర్
- మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మండిపాటు
- మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
మతాలు, కులాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ఏక్నాథ్ షిండేని సృష్టించిందే బీజేపీ అని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్లు బంద్ చేయాలని మహేశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను ఎందుకు మార్చారో తెలుసా అని మహేశ్వర్ రెడ్డిని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.