అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా
- మే 1 నుంచి కొత్త పేర్లతో పిలవాలంటూ వెబ్ సైట్ లో లిస్టు
- సరిహద్దులపై వివాదాస్పద ప్రకటన
- మరోసారి డ్రాగన్ కవ్వింపు చర్యలు
అందుకే ఆయా ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్ లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా ప్రభుత్వం పేర్కొందని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అరుణాచల్ ను దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తూ, జాంగ్నాన్ అని నామకరణం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా లిస్టు విడుదల చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017 నుంచి ఇలా కొత్త పేర్లతో చైనా లిస్ట్ విడుదల చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా డ్రాగన్ కంట్రీ తేలిగ్గా తీసుకుంటోంది.