ఢిల్లీ క్యాపిటల్స్కి ఊహించని షాక్.. కెప్టెన్ రిషభ్ పంత్కు భారీ జరిమానా!
- రిషభ్ పంత్కు రూ.12 లక్షల జరిమానా
- స్లో ఓవర్ రేట్ కారణంగానే ఫైన్ వేసినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడి
- నిన్న వైజాగ్ వేదికగా సీఎస్కే, డీసీ మధ్య మ్యాచ్
- 20 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 20 పరుగుల తేడాతో డీసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్ రెండు వరుస పరాజయాల తర్వాత రిషభ్ పంత్ సేన తొలి విక్టరీ సాధించింది. డేవిడ్ వార్నర్, పంత్ అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. పేసర్లు ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ అద్భుతమైన స్పెల్లతో సీఎస్కేను కట్టడి చేయడంతో 20 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పంత్ నేతృత్వంలోని ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ సీజన్లో మొదటి విజయాన్ని రుచి చూసింది. అటు డిఫెండింగ్ ఛాంపియన్స్ సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో మొదటి ఓటమిని చవిచూసింది.