రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
- ఇప్పటి వరకు 13 మంది అభ్యర్థుల ప్రకటన
- పెండింగ్లోని నాలుగు స్థానాల్లో అభ్యర్థులపై అధిష్ఠానంతో చర్చించనున్న సీఎం
- ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్ కమిటీ
కేకే ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కే కేశవరావు నివాసానికి వెళ్లారు. కేకే కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేరిక కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. కేకే నివాసానికి వెళ్లిన వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, తదితరులు ఉన్నారు.