Kesineni Nani: విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Kesineni Nani Sensational Comments on Vijayawada West Constituency
  • విజయవాడ వెస్ట్ నియోజకవర్గంపై ఎన్టీయే కూటమి కుట్రలు చేస్తోందన్న కేశినేని నాని
  • టికెట్ బీసీలకు కాకుండా బీజేపీ తరపున ఓ బిజినెస్ మేన్ కు ఇస్తున్నారని విమర్శ
  • జగన్ చెప్పినట్టు ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్య
విజయవాడ వైసీపీ లోక్ సభ అభ్యర్థి ఎంపీ కేశినేని నాని ఎన్డీయేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంపై ఎన్డీయే కూటమి కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ నియోజకవర్గాన్ని జనసేనకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం అని మొన్నటి దాకా టీడీపీ చెప్పిందని... కానీ, ఈ నియోజకవర్గ టికెట్ ను బీసీ అభ్యర్థికి కాకుండా బీజేపీ తరపున ధనికుడైన ఓ బిజినెస్ మెన్ కు ఇవ్వబోతున్నారని... ఆయన వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి అని పరోక్షంగా సుజనా చౌదరి గురించి వ్యాఖ్యానించారు. ఛార్టెర్డ్ ఫ్లయిట్స్ లో తిరిగే ఆ వ్యాపారవేత్త గల్లీ నుంచి ఢిల్లీ వరకు వ్యవస్థలను మేనేజ్ చేయగలరని చెప్పారు. 

పేదలు ఉన్న నియోజకవర్గంలో ధనికులకు టికెట్ ఇస్తున్నారని కేశినేని నాని దుయ్యబట్టారు. తమ అధినేత సీఎం జగన్ చెపుతున్నట్టు ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. గెలిచే సత్తా లేక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. విజయవాడ వెస్ట్ సీటు ఎప్పటికీ బీసీలు, మైనార్టీలదేనని... గతంలో తన కూతురు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే వద్దని తాను బహిరంగంగా చెప్పానని తెలిపారు.
Kesineni Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
NDA

More Telugu News