రంగంలోకి కేసీఆర్.. ఉగాది తర్వాత రోడ్షోలతో జనంలోకి
- లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కేసీఆర్
- రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు ప్రణాళిక
- హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీకాంత్!
క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ద్వారా ప్రజలకు దగ్గర కావడంతోపాటు క్యాడర్లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకే కేసీఆర్ రోడ్షో నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 17 లోక్సభ స్థానాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ హైదరాబాద్ స్థానాన్ని పెండింగులో పెట్టారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ అభ్యర్థిగా దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించాల్సి ఉందని సమాచారం.