కవితను ఢిల్లీకి తీసుకువెళ్లడానికి రాత్రి 8.45 గంటల ఫ్లైట్లో టిక్కెట్లు బుక్ చేసిన ఈడీ
- కవితను అరెస్ట్ చేసినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన ఈడీ
- కాసేపట్లో శంషాబాద్ విమానాశ్రయానికి తరలింపు
- ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం
మరోపక్క, ఈ కేసులో మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక, కవిత అరెస్ట్ విషయం తెలిసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భారత జాగృతి కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈడీకి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవిత నివాసానికి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వచ్చారు.